
- లండన్: ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్స్ కోసం
- టీమిండియా ప్రిపరేషన్స్లో వేగం పెంచింది. ఫుల్ టీమ్ లండన్కు
చేరుకోవడంతో ప్రాక్టీస్ ముమ్మరం చేసింది. ఓవైపు బ్యాటర్లు.. మరోవైపు బౌలర్లు నెట్స్లో తీవ్రంగా చెమటోడ్చుతున్నారు. ఫైనల్కు వేదికైన ఓవల్ వికెట్ ఎలా ఉంటుందో తెలియకపోయినా అరుండెల్ క్రికెట్ క్లబ్లో విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్, చతేశ్వర్ పుజారా డస్ట్ పిచ్పై బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. అన్ని రకాల కండిషన్స్కు అలవాటుపడాలనే ఉద్దేశంతో స్పిన్కు అనుకూలంగా ఉండే వికెట్లపై తమ నైపుణ్యానికి మరింత పదును పెట్టుకున్నారు. ఫ్రంట్ఫుట్ బ్యాటింగ్లో విరాట్ చూడముచ్చటైన ఎక్స్ట్రా కవర్డ్రైవ్స్, లెగ్ గ్లాన్స్తో అలరించాడు.
రోహిత్ బ్యాక్ ఫుట్ గేమ్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. గిల్, భరత్, అక్షర్ పటేల్, పుజారా, రహానె కూడా నెట్స్లో ప్రాక్టీస్ చేశారు. పేసర్లందరు లైన్ అండ్ లెంగ్త్తో పాటు బౌన్సర్లను ట్రై చేశారు. ఈ నెల 7 నుంచి జరిగే పోరులో ఆస్ట్రేలియాను ప్రధాన ఆయుధమైన స్పిన్తోనే దెబ్బకొట్టాలని భావిస్తున్న ఇండియా.. జడేజా, అశ్విన్పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. తుది జట్టులో ఆడించాలన్న ప్రణాళికలు ఉన్నా.. టాస్ టైమ్కు పిచ్ను బట్టి నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తానికి మరో నాలుగు రోజుల్లో మొదలయ్యే మెగా ఫైట్కు రోహిత్సేన అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది.