బుక్స్ వచ్చాయ్​ .. కొన్ని టైటిల్స్​ ఇంకా రాలే .. స్కూల్స్​ తెరిచే నాటికి పంపిణీకి సిద్ధం

బుక్స్ వచ్చాయ్​ .. కొన్ని టైటిల్స్​ ఇంకా రాలే .. స్కూల్స్​ తెరిచే నాటికి పంపిణీకి సిద్ధం

యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, వెలుగు : గవర్నమెంట్​స్కూల్స్​లో చదివే స్టూడెంట్స్​కు టెక్ట్స్​బుక్స్, నోట్​ బుక్స్​తోపాటు యూనిఫామ్స్​కూడా అందించేందుకు ఎడ్యుకేషన్ డిపార్ట్​మెంట్​చర్యలు చేపట్టింది. స్కూల్స్​ ఓపెనింగ్స్ రోజే స్టూడెంట్స్​కు అందించనున్నారు. ఇప్పటికే మండలాలకు డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ మొదలైంది. 

యాదాద్రి జిల్లాలో.. 

యాదాద్రి జిల్లాలో ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక, కస్తూర్బా, మోడల్ స్కూల్స్ కలిపి మొత్తం 753 స్కూల్స్ ఉన్నాయి. ఈసారి టెన్త్​లో మంచి ఫలితాలు రావడంతో ప్రైవేట్​స్కూల్స్​నుంచి కొత్తగా అడ్మిషన్స్​పెరుగుతాయని భావిస్తున్నారు. అన్ని స్కూల్స్​ కలిపి ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే ప్రస్తుత స్టూడెంట్స్ యూఐడీ ఎన్​రోల్​మెంట్​ప్రకారం​42 వేల మందికి పైగా ఉన్నారు. ఈ లెక్కన 2025-–26 విద్యాసంవత్సరంలో 2,90,790 టెక్ట్స్​బుక్స్ అవసరం పడనున్నాయి. 

142 టైటిల్స్ ఉండగా, ఇప్పటివరకు 128 టైటిల్స్​కు సంబంధించిన 2.50 లక్షల (82 శాతం) బుక్స్​వచ్చాయి. మండలాలకు టెక్ట్స్​బుక్స్​డిస్ట్రిబ్యూషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. నోట్​బుక్స్​మాత్రం ఈసారి జిల్లా హెడ్​క్వార్టర్​కు కాకుండా డెరెక్ట్​గా మండలాలకు పంపిస్తారు. అక్కడి నుంచి స్కూల్స్​కు పంపించనున్నారు. కాగా కొన్ని టైటిల్స్​ఇంకా పూర్తి స్థాయిలో రాలేదని ఆఫీసర్లు చెబుతున్నారు. పది, తొమ్మిదో తరగతి పర్యావరణం, 6 నుంచి 8వ తరగతి వరకు  హిందీ టైటిల్స్ రాలేదు. పార్ట్​–1లో సిలబస్ పూర్తయ్యేనాటికి పార్ట్–2 టెక్ట్స్​బుక్స్ వస్తాయి. 

నల్గొండ జిల్లాలో..

నల్గొండ జిల్లాలో మొత్తం 2,028 స్కూల్స్ ఉండగా, వీటిలో 2,23,246 మంది స్టూడెంట్స్ ఉన్నారు. జిల్లాకు 6 లక్షల పుస్తకాలు అవసరం అని ఆఫీసర్లు ప్రపోజల్స్ పంపించగా, ఇప్పటివరకు 5 లక్షల పుస్తకాలు చేరుకున్నాయి. ఇంకా లక్ష పుస్తకాలు రావాల్సి ఉంది. ఇక పార్ట్ –-2 సంబంధించిన పుస్తకాలు 1,72,450  ఆగస్టులో వస్తాయని ఆఫీసర్లు తెలిపారు. 

సూర్యాపేట జిల్లాలో..

సూర్యాపేట జిల్లాలో 1,050 స్కూల్స్ ఉండగా, 90 వేల మంది స్టూడెంట్స్ విద్యనభ్యసిస్తున్నారు. జిల్లాకు 4,65,600 పుస్తకాలు అవసరమని ఆఫీసర్లు ప్రతిపాదనలు పంపించారు. ఇప్పటివరకు పార్ట్ –-1 పుస్తకాలు 3,55,180 అవసరం కాగా, 2,86,640 బుక్స్ చేరుకున్నాయి. పార్ట్ –-2కు సంబంధించి 1.10 లక్షలు పుస్తకాలు ఆగస్టులో రావాల్సి ఉంది.  

సిద్ధమవుతున్న యూనిఫామ్స్.. 

స్కూళ్లు రీ–- ఓపెనింగ్ రోజే యూనిఫాం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నల్గొండ జిల్లాలో 62,532 మంది విద్యార్థులకు 2.50 లక్షల మీటర్ల క్లాత్ అవసరం ఉంది. ఇప్పటివరకు 29,850 మంది బాలురు, 32,682 బాలికలకు అవసరమైన మొదటి జత క్లాత్ వచ్చింది. కుట్టడం కూడా దాదాపు పూర్తి కావొచ్చింది. సూర్యాపేటలో 49,374 మంది విద్యార్థులకు 2,95,420 మీటర్ల క్లాత్ అవసరం ఉంది. 29,850 మంది బాలురు, 32,682 బాలికలకు రెండు జతల చొప్పున అందించాల్సి ఉండగా, ఇప్పటివరకు 24,579 జతలు పూర్తయ్యాయి. యాదాద్రి జిల్లాలో 42 వేల మందికి స్కూల్​యూనిఫారం అందించేందుకు స్టిచింగ్ వర్క్​ వేగంగా నడుస్తోంది. స్కూల్స్ ప్రారంభం నాటికి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.