దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతండటంతో వ్యాక్సిన్లకు డిమాండ్ పెరిగింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా వ్యాక్సిన్లలో ఒక్కోదానికి ఒక్కోరేటు ఉంది. వాటిలో రెమిడెసివర్ వ్యాక్సిన్ను దేశంలో ఏడు కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి. ఆ వ్యాక్సిన్ ధరను కేంద్రం చొరవతో ఉత్పత్తి కంపెనీలు భారీగా తగ్గించాయి. పాత ధరలతో పోల్చితే దాదాపు రూ. 2 వేల వరకు తగ్గించాయి. ఈ వ్యాక్సిన్ కొత్త ధరలను నిర్ణయించిన కేంద్ర కెమికల్స్ అండ్ ఫర్టీలైజర్స్ మంత్రిత్వ శాఖ.. ఓ ప్రకటన విడుదలచేసింది.
రెమిడెసివర్ వ్యాక్సిన్ కొత్త ధరలు
కాడిలా వ్యాక్సిన్ ధర గతంలో రూ. 2,800గా ఉంటే.. ఇప్పుడు ఆ ధరను రూ. 899కి తగ్గించారు.
సింజెన్ వ్యాక్సిన్ ధర గతంలో రూ. 3,950గా ఉంటే.. ఇప్పుడు ఆ ధరను రూ. 2,450కి తగ్గించారు.
డాక్టర్ రెడ్డీస్ వ్యాక్సిన్ ధర గతంలో రూ. 5,400గా ఉంటే.. ఇప్పుడు ఆ ధరను రూ. 2,700కి తగ్గించారు.
సిప్లా వ్యాక్సిన్ ధర గతంలో రూ. 4,000గా ఉంటే.. ఇప్పుడు ఆ ధరను రూ. 3,000కి తగ్గించారు.
మైలాన్ వ్యాక్సిన్ ధర గతంలో రూ. 4,800గా ఉంటే.. ఇప్పుడు ఆ ధరను రూ. 3,400కి తగ్గించారు.
జుబ్లియంట్ వ్యాక్సిన్ ధర గతంలో రూ. 4,700గా ఉంటే.. ఇప్పుడు ఆ ధరను రూ. 3,400కి తగ్గించారు.
హెటిరో వ్యాక్సిన్ ధర గతంలో రూ. 5400గా ఉంటే.. ఇప్పుడు ఆ ధరను రూ. 3,490కి తగ్గించారు.