దేశంలోనే మొదటి సోలార్ బోట్‌‌‌‌ ఇది!

దేశంలోనే మొదటి సోలార్ బోట్‌‌‌‌ ఇది!

దేశంలోనే మొదటి సోలార్ బోటును (ఫెర్రీ బోట్‌‌–ప్యాసెంజర్లు, కొన్ని సార్లు వెహికల్స్‌‌ను నదులు దాటించే బోటును) నవల్ట్‌‌  సోలార్‌‌‌‌ అండ్ ఎలక్ట్రిక్ బోట్స్‌‌ తీసుకొచ్చింది. ఆదిత్య పేరుతో పిలుస్తున్న ఈ బోట్‌‌లో ఒకేసారి 75 మంది కూర్చోవచ్చు. ఎండగా ఉన్న రోజు సోలార్ కరెంట్‌తో 6 గంటల వరకు ఈ బోట్ కదులుతుంది. కేరళ స్టేట్‌‌ వాటర్ ట్రాన్స్‌‌పోర్ట్ డిపార్ట్‌‌మెంట్‌‌ కోసం దీనిని తయారు చేశారు. ఈ బోట్‌‌ ధర రూ. 1.95 కోట్లు (2013 టెండర్ రేటు).  డీజిల్ వెర్షన్‌‌ కోసం రూ. 1.5 కోట్లు ఖర్చు చేయాలి. ఆదిత్య ఫెర్రీతో 2.8 కి.మీ దూరానికి కేవలం రూ. 4 మాత్రమే ఖర్చ అవుతుంది.