మేడారం వన దేవతలకు భక్తుల మొక్కులు

మేడారం వన దేవతలకు భక్తుల మొక్కులు

తాడ్వాయి, వెలుగు:  వన దేవతలు సమ్మక్క, సారలమ్మ దర్శించుకునేందుకు గురువారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మేడారంలో జాతర సందడి నెలకొంది. భారీగా తరలిరాగా.. ముందుగా జంపన్నవాగులో స్నానాలు చేసి గద్దెల వద్దకు చేరుకున్నారు.  గిరిజన సంప్రదాయం ప్రకారం గద్దెల వద్ద చీర, సారె, పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, కానుకలు, సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వెంట తెచ్చుకున్న యాటలను, కోళ్లను దేవతలకు బలిచ్చారు. 

అనంతరం వనభోజనాలు చేశారు. వనదేవతలను దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్ కే సంధ్యారాణి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్ సునిత దర్శించుకున్నారు.  పూజారులు ఘన స్వాగతం పలికారు. అధికారులు గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేయగా.. శాలువాలతో సత్కరించి అమ్మవారి ప్రసాదం అందజేశారు.  ఎండోమెంట్ ఈవో రాజేంద్ర ఈనెల 31న పదవీ విరమణ చేయనుండగా.. ఉన్నతాధికారులు, పూజారులు ఆయనను సన్మానించారు.