ఆన్​లైన్ ​క్లాసులకు స్మార్ట్​ఫోన్ ​కోసం కూలీగా​ స్టూడెంట్

ఆన్​లైన్ ​క్లాసులకు స్మార్ట్​ఫోన్ ​కోసం కూలీగా​ స్టూడెంట్

ఆన్​లైన్ ​క్లాస్​లు వినేందుకు స్మార్ట్​ఫోన్​ లేకపోవడంతో కొనుక్కునేందుకు అవసరమైన పైసల కోసం ఓ స్టూడెంట్​ కూలీగా మారాడు. మెదక్​జిల్లా శివ్వంపేట మండలం తాళ్లపల్లి గడ్డ తండాకు చెందిన పవన్​ నర్సాపూర్​ రెసిడెన్షియల్​ కాలేజీలో ఇంటర్​ సెకండియర్ ఎంపీసీ చదువుతున్నాడు. కరోనాతో కాలేజీ నడవడం లేదు. కూలి పనిచేసే తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా స్మార్ట్​ఫోన్​ కొనివ్వలేక పోయారు. దీంతో ఆన్​లైన్​ క్లాసులు వినేందుకు అవసరమైన స్మార్ట్​ఫోన్​ను ఎలాగైనా కొనుక్కోవాలన్న పట్టుదలతో కొద్ది రోజులుగా పొలం పనులకు కూలీగా వెళ్తున్నాడు. ఊరిలో వ్యవసాయ పనులు లేనపుడు మేడ్చల్​కు వెళ్లి అడ్డా కూలీగా పనిచేస్తున్నాడు.  - మెదక్/శివ్వంపేట, వెలుగు