
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో 27 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల పరీక్షలు జరిగాయి. ఉదయం జరిగిన ఈ పరీక్షలకు ఫస్టియర్ స్టూడెంట్లు 1,30,925 మందికి గానూ 1,19,634 (91.37%) మంది అటెండ్ అయ్యారు. ఫస్టియర్ లో జగిత్యాలలో ఆరు, మహబూబాబాద్ లో 8 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. మధ్యాహ్నం జరిగిన సెకండియర్ పరీక్షలకు 48,047 మందికి 43,387 (90.30%) మంది అటెండ్ అయ్యారు. మంగళవారంతో మెయిన్ సబ్జెక్టుల పరీక్షలు పూర్తికానున్నాయి.