టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

 టీఎస్‌పీఎస్సీ పేపర్  లీకేజీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

టీఎస్‌పీఎస్సీ పేపర్  లీకేజీ కేసులో జులై 12వ తేదీ బుధవారం మరో ఇద్దరు అరెస్టయ్యారు. కరీంనగర్ కు చెందిన మద్దెల శ్రీనివాస్, అతని కూతురు మద్దెల సాహితీలను  సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. పోల రమేశ్ సహకారంతో సాహితి హైటెక్ మాస్ కాపీయింగ్ లో పరీక్షలు రాసినట్లు అధికారులు గుర్తించారు.

కూతురు సాహితీ పరీక్షల కోసం పోల రమేశ్ తో తండ్రి  శ్రీనివాస్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. విచారణలో ఈ విషయం వెలుగు చూడటంతో శ్రీనివాస్, సాహితీలను అరెస్ట్ చేశారు. రమేశ్ నుండి ఏఈఈ ఎగ్జామ్ పేపర్ ను  కొనుగోలు చేసిన ఆరుగురిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రమేశ్ కు ఆరుగురి నుండి డబ్బులు వచ్చినట్లు ట్రాన్సాక్షన్స్ ద్వారా గుర్తించారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఇప్పటి వరకు 80 మంది అరెస్టయ్యారు.