
తిర్యాణి, వెలుగు: వన్యప్రాణులను వేటాడేందుకు అటవీ ప్రాంతంలో విద్యుత్ ఉచ్చులు ఏర్పాటు చేసి రెండు గేదెల మృతికి కారణమైన ఇద్దరిని తిర్యాణి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. రొంపల్లి గ్రామా శివారులోని అటవీ ప్రాంతంలో అమర్చిన కరెంట్ తీగలు తగిలి కొద్దిరోజుల క్రితం రెండు గేదెలు చనిపోయాయి.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొద్దిగూడ గ్రామానికి చెందిన నైతం సాగర్, కొలంగూడకు చెందిన టేకం భీంరావు కలిసి కరెంట్ తీగలు అమర్చినట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. శనివారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా13 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు.