నిరుద్యోగులకు గుడ్ న్యూస్..హైదరాబాద్ మిధానిలో ఉద్యోగాలు

 నిరుద్యోగులకు గుడ్ న్యూస్..హైదరాబాద్ మిధానిలో ఉద్యోగాలు

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. హైదరాబాద్ లోని ప్రముఖ సంస్థ కంచన్‌బాగ్‌లోని(మిధాని) మిశ్ర ధాతు నిగం లిమిటెడ్‌ లో (Mishra Dhatu Nigam Limited) పలు విభాగాల్లో ఖాళీలు ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.. ఈ మేరకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 54 పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేముందు ఆసక్తి గల అభ్యర్థులు అర్హత, వయోపరిమితి,ఎంపిక ప్రక్రియ,శాలరీ గురించి తెలుసుకోవడం ముఖ్యం.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మొత్తం ఖాళీలు -54

  • 1. సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ- మెటలర్జీ: 20 పోస్టులు
  • 2.సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ- మెకానికల్: 10 పోస్టులు
  • 3.జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ- ఫిట్టర్: 13 పోస్టులు
  • 4. జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ- వెల్డర్: 02 పోస్టులు
  • 5. జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ- ఎలక్ట్రీషియన్: 06 పోస్టులు
  • 6. సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ- ఎలక్ట్రికల్: 03 పోస్టులు

అర్హతలు..

10వ తరగతి, సంబంధిత ట్రేడ్/ విభాగంలో ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి..

జేవోటీ పోస్టులకు 30 ఏళ్లు. ఎస్‌ఓటీ పోస్టులకు 35 సంవత్సరాలు మించకూడదు..

ఎంపిక విధానం..

రాత/ ప్రాక్టికల్/ ట్రేడ్ టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు..

వేతనం..

నెలకు జేవోటీ పోస్టులకు రూ.20,000. ఎస్‌ఓటీ పోస్టులకు రూ.21,900.

దరఖాస్తు రుసుము..

రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు  ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది..

ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.. చివరి తేదీ నవంబర్ 1 సాయంత్రం 5 లోపు అప్లై చేసుకోవాలి.. ఈ ఉద్యోగాల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే https://midhani-india.in/ వెబ్ సైట్ ను సందర్శించండి

ALSO READ : ప్రగతి భవన్‌లో ఘనంగా విజయదశమి వేడుకలు