మందమర్రి ఏరియా సింగరేణి వర్క్​షాప్ డీజీఎంగా ధూప్​సింగ్

మందమర్రి ఏరియా సింగరేణి వర్క్​షాప్ డీజీఎంగా ధూప్​సింగ్

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియా సింగరేణి వర్క్​షాప్​ కొత్త డీజీఎంగా వి.ధూప్​సింగ్​శనివారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఆయనకు వర్క్​షాప్ ఉద్యోగులు, కార్మికులు, ఆఫీస్​ సిబ్బంది, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ లీడర్లు ఘనంగా స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన డీజీఎం వర్క్​షాప్​లోని వివిధ సెక్షన్లను పరిశీలించారు.

 సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్​ భీమనాథుని సుదర్శనం, జాయింట్​సెక్రటరీ కంది శ్రీనివాస్, వర్క్​మెన్​ ఇన్​స్పెక్టర్లు ముల్కలపల్లి వెంకటేశ్వర్లు, తోట వెంకటస్వామి, ఇన్​చార్జి పిట్ సెక్రటరీ రాజేశం తదితరులు పాల్గొన్నారు.