
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియా సింగరేణి వర్క్షాప్ కొత్త డీజీఎంగా వి.ధూప్సింగ్శనివారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఆయనకు వర్క్షాప్ ఉద్యోగులు, కార్మికులు, ఆఫీస్ సిబ్బంది, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ లీడర్లు ఘనంగా స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన డీజీఎం వర్క్షాప్లోని వివిధ సెక్షన్లను పరిశీలించారు.
సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ భీమనాథుని సుదర్శనం, జాయింట్సెక్రటరీ కంది శ్రీనివాస్, వర్క్మెన్ ఇన్స్పెక్టర్లు ముల్కలపల్లి వెంకటేశ్వర్లు, తోట వెంకటస్వామి, ఇన్చార్జి పిట్ సెక్రటరీ రాజేశం తదితరులు పాల్గొన్నారు.