కాశీబుగ్గ, వెలుగు: ఓరుగల్లు భద్రకాళి అమ్మవారిని శుక్రవారం సినీ హీరోయిన్ డింపుల్ హయాతి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా విడుదలను పురస్కరించుకుని చిత్ర బృందంతో కలిసి వచ్చిన హీరోయిన్ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పూజల అనంతరం అర్చకులు వారిని ఆశీర్వదించారు. షూటింగ్విశేషాలను పంచుకున్న తర్వాత ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు భక్తులు, స్థానిక ప్రజలు ఆసక్తి చూపించారు.
