ప్రాణం తీసిన వాటర్​ ట్యాంకర్ .. స్కూటీని వెనుక నుంచి ఢీకొనడంతో వ్యక్తి మృతి

ప్రాణం తీసిన వాటర్​ ట్యాంకర్ .. స్కూటీని వెనుక నుంచి ఢీకొనడంతో వ్యక్తి మృతి
  • 21 రోజుల కింద తండ్రి..  ఇప్పుడు కొడుకు మృతితో తీవ్ర విషాదం

మియాపూర్, వెలుగు: స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వాటర్ ​ట్యాంకర్ ​ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడమంచి గ్రామానికి చెందిన బి.అశోక్​(42) తన భార్య, ఇద్దరు కూతుళ్లు, కొడుకుతో కలిసి హైదరాబాద్​లోని ఫిరోజ్​గూడలో  ఉంటున్నారు. ఓ కార్గో కంపెనీలో జాబ్  చేస్తున్న అశోక్.. బుధవారం ఉదయం డ్యూటీ  మీద స్కూటీపై ముత్తంగి వెళ్లాడు. అనంతరం తిరిగి వెళ్తుండగా.. చందానగర్ ​నుంచి మియాపూర్​ వైపు వెళ్తున్న అశోక్​ను మదీనగూడ జీఎస్ఎం మాల్​వద్ద  వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చి వాటర్ ​ట్యాంకర్ ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో అశోక్​అక్కడికక్కడే మృతి చెందగా, డెడ్​బాడీని మియాపూర్​  పోలీసులు గాంధీ మార్చురీకి తరలించారు. ప్రమాదం అనంతరం వాటర్ ​ట్యాంకర్​ను అక్కడే వదిలేసి డ్రైవర్​పరారీ కాగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 9న అశోక్ ​తండ్రి పోచయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. పెద్ద దిక్కును కోల్పోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆ కుటుంబానికి అశోక్ మరణం మరింత శోకాన్ని మిగిల్చింది. ​