భార్య పండుగకు రాలేదని భర్త ఆత్మహత్య

భార్య పండుగకు రాలేదని భర్త ఆత్మహత్య

పుట్టింటికి వెళ్లిన భార్య.. కర్వా చౌత్‌ పండుగ రోజు కూడా తన ఇంటికి తిరిగి రాకపోవడంతో కలత చెందిన 24 ఏళ్ల వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని అక్కడి పోలీసులు నవంబర్ 2న తెలిపారు. భూటా పోలీస్ స్టేషన్ పరిధిలోని గుగా గ్రామానికి చెందిన ప్రమోద్ కుమార్ నవంబర్ 1న రాత్రి తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వారు తెలిపారు. వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు చెప్పారు.

ప్రమోద్ భార్య ప్రీతి రెండు నెలల క్రితం తన తల్లి ఇంటికి వెళ్లిందని అతని తాత బాబూరామ్ తెలిపారు. కర్వా చౌత్‌లో ప్రీతి ఇంటికి తిరిగి రావడంపై ప్రమోద్‌ బుధవారం తన అత్తగారితో ఫోన్‌లో వాగ్వాదానికి దిగాడు. అనంతరం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆయన తెలిపారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు ప్రమోద్ గది తలుపులు పగలగొట్టి చూడగా ఉరివేసుకుని కనిపించాడని బాబూరామ్ తెలిపారు.

నవంబర్ 1న దేశంలోని అనేక ప్రాంతాల్లో కర్వా చౌత్‌లో భాగంగా మహిళలు తమ భర్తల భద్రత, దీర్ఘాయువు కోసం సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఉపవాసం పాటించారు.