నల్గొండ: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర 34వ రోజు కొనసాగుతోంది. ఇవాళ బుధవారం ఆలేరు నియోజవర్గంలోని మూటకొండూరు మండలం వార్టురులో ప్రారంభమైంది. ఈ పాదయాత్ర ఆత్మకూరు మండలం పల్లెపహాడ్ వరకు కొనసాగనుంది. దారి పొడవునా ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలపై తెలుసుకుని ఓదారుస్తూ.. అండగా నిలుస్తానని భరోసానిస్తూ.. ముందుకు సాగుతున్నారు వైఎస్ షర్మిల. సాయంత్రం వరకు సాగనున్న ఈ పాదయాత్రలో భాగంగా పల్లెపహాడ్ లో మాట ముచ్చట కార్యక్రమంలో పాల్గొన్ననున్నారు షర్మిల.
ఇవి కూడా చదవండి
వైరల్ వీడియో: మురికి కాలువను క్లీన్ చేసిన కౌన్సిలర్