గ్రేటర్ లో వ్యాక్సినేషన్ కు లక్షా 25 వేల మంది..411 సెంటర్లు

గ్రేటర్ లో వ్యాక్సినేషన్ కు లక్షా 25 వేల మంది..411 సెంటర్లు

 

  • 16 నుంచి గ్రేటర్​లో కరోనా వ్యాక్సినేషన్​
  • హెల్త్​ స్టాఫ్ డేటా కలెక్ట్​ చేశామంటున్న డీఎంహెచ్​వోలు
  • ఈజేహెచ్ఎస్​ వెల్ నెస్​ సెంటర్ల స్టాఫ్ ను పట్టించుకోలే..

హైదరాబాద్,వెలుగు: కరోనా వ్యాక్సినేషన్ కు ​అన్ని ఏర్పాట్లు రెడీ అయ్యాయి. గ్రేటర్​లో 411 సెంటర్లలో  లక్షా 25 వేల మంది హెల్త్​స్టాఫ్ కి వ్యాక్సిన్​ వేయనున్నారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్​ తో పాటు మెడికల్​ కాలేజ్​లకు చెందిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు.  ఒక్కో సెంటర్​లో నలుగురు చొప్పున మొత్తం 1650 మంది స్టాఫ్ వ్యాక్సినేషన్​లో పాల్గొననున్నారు. రోజుకు 50 నుంచి 100మందికి వ్యాక్సినేషన్​ చేయనున్నారు. ఈనెల 16న గాంధీ, చెస్ట్​, నాంపల్లి ఏరియా, ఫీవర్​ హాస్పిటళ్లతో పాటు సికింద్రాబాద్​యశోద, సికింద్రాబాద్ కిమ్స్​, బంజారాహిల్స్​ రెయిన్ బో, జూబ్లీహిల్స్​అపోలో, బొగ్గుల కుంటలోని ఫెర్నాండెజ్​ హాస్పిటల్స్​లో  కరోనా వ్యాక్సినేషన్  ప్రారంభమవుతుండగా ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్​గా ప్రారంభించి హెల్త్​ స్టాఫ్ తో మాట్లాడనున్నట్లు తెలిసింది.

వీరి వివరాలు తీసుకోలే..

అందరి డాటాను కలెక్ట్ చేశామని జిల్లా మెడికల్​ ఆఫీసర్లు చెబుతున్నప్పటికీ ఆరోగ్యశ్రీ  కిందకు వచ్చే  ఎంప్లాయీస్​,పెన్షనర్లు,జర్నలిస్టుల(ఈజేహెచ్​ఎస్​)లతో పాటు వెల్​నెస్​ సెంటర్లలోని హెల్త్ స్టాఫ్​వివరాలను తీసుకోలేదు. రాష్ట్రంలో మొత్తం12వెల్​నెస్​ సెంటర్లు ఉండగా వీటిలో డాక్టర్స్, స్టాఫ్ తో పాటు ఇతరులు 500 మంది వరకు ఉన్నారు.  కొన్ని వెల్​ నెస్​ సెంటర్లలోనైతే డేటాను కలెక్ట్​ చేశారు.  కానీ హైదరాబాద్​ జిల్లాలోని ఖైరతాబాద్, రంగారెడ్డి జిల్లాలోని వనస్థలిపురం, మేడ్చల్​ జిల్లా పరిధిలోని కూకట్​పల్లిలోని వెల్​నెస్​ సెంటర్ల స్టాఫ్ వివరాలు తీసుకోలేదు. వీరికి వ్యాక్సినేషన్ కి సంబంధించి ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు.

3 వెల్​నెస్​ సెంటర్లలోని స్టాఫ్​కి..

ఖైరతాబాద్, వనస్థలిపురం, కూకట్​పల్లి వెల్​నెస్​ సెంటర్లకు ప్రతిరోజూ వెయ్యి వరకు ఓపీ పేషెంట్లకు  ట్రీట్​మెంట్అందిస్తున్నారు. ఆయా సెంటర్లలో130 మంది స్టాఫ్ పని చేస్తున్నారు. కరోనా​ టైమ్​లో ఫ్రంట్​లైన్​లో ఉంటూ ట్రీట్ మెంట్​అందించారు. ఇదే సమయంలో కొందరు డాక్టర్లతో పాటు స్టాఫ్​ కూడా కరోనా బారిన పడ్డారు. తమను గుర్తించకపోవడంతో సిబ్బంది ఆందోళన లో పడ్డారు. పాజిటివ్​వచ్చి క్వారంటైన్​లో ఉన్న వారికి పేవ్​మెంట్​ ఇవ్వలేదని, వ్యాక్సిన్​ఇచ్చేందుకు వీరి నుంచి ఎలాంటి వివరాలు కూడా తీసుకోలేదు.

గ్రేటర్​ పరిధిలోని జిల్లాలు

జిల్లా                         హెల్త్​ స్టాఫ్​

హైదరాబాద్​                 78 వేలు

రంగారెడ్డి                    26 వేలు

మేడ్చల్                     21   వేలు

ఫస్ట్​ ఫేజ్​లో ఫ్రంట్​లైన్​ వారియర్స్​

హెల్త్​ డిపార్ట్ మెంట్ సిబ్బంది అందరికీ వ్యాక్సిన్​ ఇస్తం. మిస్​అయితే వారి వివరాలు కూడా సేకరిస్తున్నాం. ఎవరైనా వివరాలు ఇయ్యకుంటే వెంటనే అందించాలి. ఈజేహెచ్​ఎస్ కి సంబంధించిన వారి డేటాను కూడా సేకరిస్తున్నాం. పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఫస్ట్​ ఫేజ్​లో ఫ్రంట్​లైన్​వారియర్స్​కి  వ్యాక్సిన్ అందిస్తాం.

– డాక్టర్​ వెంకటి, డీఎంహెచ్​వో  హైదరాబాద్​జిల్లా