కరోనాతో అనాథలైన పిల్లలకు 10లక్షల సాయం

కరోనాతో అనాథలైన పిల్లలకు 10లక్షల సాయం
  • ఏపీ సీఎం జగన్ సర్కార్ నిర్ణయం

అమరావతి: కరోనాతో అనాథలైన పిల్లలకు 10లక్షల సాయం ప్రకటించింది ఏపీ సర్కార్. కరోనాతో పేదలు చనిపోతే వారి పిల్లలు అనాథలవుతుండడం గుర్తించి సీఎం జగన్‌ ఈ నిర్ణయం  తీసుకున్నారు. ఈ మొత్తాన్ని చిన్నారుల పేరుతో బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నారు. డిపాజిట్ పై వచ్చే వడ్డీతో అనాథ పిల్లల అవసరాలు తీర్చాలని సీఎం జగన్ సూచించారు. కరోనాతో చనిపోయిన వారి పిల్లలకు సాయంపై కూడా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఆర్థిక సాయంపై ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయనుంది.