గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లో 10 మంది మృతి

 గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లో 10 మంది మృతి

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నదియాడ్‌లో  అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌వేపై  ఆగి ఉన్న  ఆయిల్ ట్యాంకర్ ను అతి వేగంగా వచ్చిన ఎర్టిగా  కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న పదిమంది చనిపోయారు. ఇందులో 8 మంది స్పాట్ లోనే చనిపోగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

కారు వడోదర నుంచి అహ్మదాబాద్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.  ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రెండు అంబులెన్స్‌లు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై జామ్‌ ఏర్పడింది.  ట్రాఫిక్ ను తొలగించడానికి పోలీసు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.