కల్యాణపురంలో బీఆర్​ఎస్​ను వీడిన 100 కుటుంబాలు

కల్యాణపురంలో బీఆర్​ఎస్​ను వీడిన 100 కుటుంబాలు

అశ్వాపురం, వెలుగు: అశ్వాపురం మండల కల్యాణపురం గ్రామానికి చెందిన 100 కుటుంబాలు ఆదివారం బీఆర్ఎస్​పార్టీని వీడి కాంగ్రెస్​లో చేరాయి. పినపాక మాజీ ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీఆర్ఎస్​వైఖరి నచ్చక, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు ఆకర్షితులమై తాము కాంగ్రెస్ లో  చేరుతున్నట్లు వారు తెలిపారు. 

కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ లీడర్ తుళ్లూరు బ్రహ్మయ్య, గాద కేశవరెడ్డి, ముత్తినేని సుజాత, శ్రీనివాస్, వేములపల్లి రమేశ్​పాల్గొన్నారు.