అత్యవసర వైద్య సేవలందించే 108 అంబులెన్స్లు డీజిల్లేక నిలిచిపోతున్నాయి. యాచారం మండలానికి చెందిన వాహనం కొద్దిరోజులు ఆగిపోతే వేరేచోట నుంచి డీజిల్పోయించడంతో గురువారం కదిలింది. నాగార్జున్సాగర్రోడ్డు, విజయవాడ రోడ్డు, ఔటర్రింగ్ రోడ్డు వంటి ప్రాంతాల్లో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ఏరియాల్లో 108 వెహికల్అందుబాటులో ఉండాల్సిందే. కానీ డీజిల్కొరతతో వాహనాలు షెడ్నుంచి కదలడం లేదు. దాంతో ప్రమాదాలబారిన పడ్డవారు ప్రైవేటు అంబులెన్స్లను ఆశ్రయించాల్సి వస్తోంది. గుండెనొప్పిలాంటి సమస్య వస్తే 108 లేకపోవడంతో ప్రైవేటు వాహనాలు మాట్లాడి దవాఖానాకు తరలించే లోపే ప్రాణాలు పోయే ప్రమాదముందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 108 అంబులెన్స్లకు ప్రభుత్వం నుంచి పెద్దమొత్తంలో బిల్లులు రావాల్సి ఉంది. ఎంవోయూ గడువు ముగిసిందనే కారణాలతో బకాయిలు చెల్లించడం లేదని తెలుస్తోంది. దాంతో వాహనాలకు డీజిల్సమస్య తలెత్తుతోంది. అంతేకాకుండా జీవీకే- ఈఎంఆర్ఐ సంస్థలో పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వడంలో కూడా ఆలస్యం జరుగుతున్నట్టు సమాచారం.
బడ్జెట్ లేకపోవడంతో….
అంబులెన్స్ వాహనాల నిర్వహణను జీవీకే ఈఎంఆర్ఐ సంస్థ నిర్వహిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో 108 అంబులెన్స్వాహనాలు 22 ఉండగా ఇంధనం బకాయిలు రూ.15లక్షలు, మేడ్చల్జిల్లాలో 15 వాహనాలకు రూ.9 లక్షల బకాయిలున్నట్టు సమాచారం. వీటికి డీజిల్బకాయిలు ప్రతినెలా చెల్లింపులు జరగాల్సి ఉండగా 45రోజుల నుండి పెండింగ్లో పెట్టినట్టు సమాచారం. దాదాపు రూ. 25 లక్షలకు పైగా బకాయిలు పేరుకుపోయినట్టు తెలుస్తోంది. దీంతో పెట్రోల్పంపుల నిర్వాహకులు వాహనాలకు డీజిల్పోయడానికి వెనుకాడుతున్నారు. కొందరు డబ్బులు చెల్లిస్తేనే డీజిల్ పోస్తామని లేకుంటే పోసేది లేదని కరాఖండిగా చెబుతున్నట్టు తెలుస్తోంది. కొన్నిచోట్ల పెట్రోల్పంపు యజమానులతో జీవీకే-ఈఎంఆర్ఐ ప్రతినిధులు మాట్లాడి సమస్యను పరిష్కరిస్తున్నా, అంతటా సాధ్యంకావడం లేదు. దీంతో ప్రస్తుతం మూడు వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇంకొన్ని చోట్లకూడా డీజిల్ బిల్లులు చెల్లించక 108 వాహనాలు నిలిచిపోయే పరిస్థితి ఉంది.