
జన్నారం, వెలుగు : పుట్టిన శిశువుకు సీపీఆర్చేసిన108 సిబ్బంది బతికించిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. జన్నారం మండలం వెంకటపూర్ కు చెందిన సుద్దాల శైలజ బుధవారం పురుటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబసభ్యులు108కి ఫోన్ చేశారు.
108 సిబ్బంది అక్కడికి వెళ్లేసరికి గర్భిణి మగ శిశువుకు జన్మనిచ్చింది. శిశువుకు ఊపిరి సరిగా ఆడకపోతుండగా.. 108 సిబ్బంది జాడి రమేశ్, సంపత్ సీపీఆర్ చేసి పసిగుడ్డు ప్రాణాలు కాపాడారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం తల్లి బిడ్డను లక్సెట్టిపేట ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు.