11 ఏళ్ల బాలుడిపై పిట్ బుల్ జాతికి చెందిన పెంపుడు కుక్క దాడి చేసింది. ఈ ఘటనలో బాలుడి మొహానికి దాదాపు 200 కుట్లు పడ్డాయి. ఈ ఘటన ఘజియాబాద్లో చోటుచేసుకుంది. గత వారం తన ఇంటి సమీపంలోని పార్కులో ఆడుకుంటున్న బాలుడిపై పిట్ బుల్ కుక్క దాడి చేసింది. దాడి చేసిందంతా సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఓ బాలిక కుక్కను తీసుకొని పార్కులో నడుస్తుండగా.. అకస్మాత్తుగా పిల్లవాడిపై ఆ కుక్క దాడి చేసినట్టుగా వీడియోలో కనిపిస్తుంది. ఆ సమయంలో ఓ వ్యక్తి వచ్చి ఆ బాలుడిని రక్షించాడు.
ఎలాంటి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ లేకుండా కుక్కను పార్కులో ఉంచిన యజమానికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రూ. 5,000 జరిమానా విధించారు ఈ ఘటన పై స్థానికులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. పిల్లలు ఆడుకోవడానికి వచ్చే పార్కుల వద్ద జంతువులను విడిచిపెట్టడం సరికాదంటూ తెలిపారు. ఉత్తరప్రదేశ్లో పెంపుడు కుక్కల దాడికి సంబంధించిన రెండు దిగ్భ్రాంతికరమైన సంఘటనలు వెలుగులోకి వచ్చిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.