కామారెడ్డి జిల్లాలో 110 మొబైల్ ఫోన్ల రికవరీ  

 కామారెడ్డి జిల్లాలో 110 మొబైల్ ఫోన్ల రికవరీ  

కామారెడ్డిటౌన్​, వెలుగు : కామారెడ్డి జిల్లాలో పొఈగొట్టుకున్న ఫోన్లు, చోరీకి గురైన 110 ఫోన్లను సీఈఐఆర్ సిస్టమ్ ద్వారా రికవరీ చేసినట్లు ఎస్పీ రాజేశ్​చంద్ర తెలిపారు.  గురువారం జిల్లా పోలీసు ఆఫీసులో వివరాలు వెల్లడించారు. రికవరీ చేసిన ఫోన్ల విలువ సుమారు రూ. 16 లక్షలు ఉంటుందన్నారు.

బాధితులు జిల్లా పోలీసు ఆఫీసుకు వచ్చి ఫోన్లు పొందవచ్చన్నారు. సీఈఐఆర్ విధానంలో ఫోన్ల రికవరీ కోసం ఇన్​స్పెక్టర్​ స్థాయి ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐ, 10 మంది కానిస్టేబుల్స్​తో టీమ్ ఏర్పాటు చేశామన్నారు. ఫోన్లు రికవరీ చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.