
కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లాలో పొఈగొట్టుకున్న ఫోన్లు, చోరీకి గురైన 110 ఫోన్లను సీఈఐఆర్ సిస్టమ్ ద్వారా రికవరీ చేసినట్లు ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. గురువారం జిల్లా పోలీసు ఆఫీసులో వివరాలు వెల్లడించారు. రికవరీ చేసిన ఫోన్ల విలువ సుమారు రూ. 16 లక్షలు ఉంటుందన్నారు.
బాధితులు జిల్లా పోలీసు ఆఫీసుకు వచ్చి ఫోన్లు పొందవచ్చన్నారు. సీఈఐఆర్ విధానంలో ఫోన్ల రికవరీ కోసం ఇన్స్పెక్టర్ స్థాయి ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐ, 10 మంది కానిస్టేబుల్స్తో టీమ్ ఏర్పాటు చేశామన్నారు. ఫోన్లు రికవరీ చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.