మధ్యప్రదేశ్లోని మొరెనా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పహవాలి, మన్పూర్ అనే రెండు గ్రామాల్లో కల్తీ మద్యం తాగి 12 మంది చనిపోయారు. మరో ఆరుగురు ఆస్పత్రి పాలయ్యారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. పోలీసుల వివరాల ప్రకారం, ఈ మద్యం స్థానికంగా తయారు చేయబడింది. మద్యం తాగిన తర్వాత అర్థరాత్రి వాంతులయ్యాయి. తరువాత వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళుతుండగా 10 మంది మరణించగా,మరో ఇద్దరు మోరెనాలోని ఆసుపత్రిలో మరణించారు. అయితే మద్యంలో ఎలాంటి విష పదార్థాలు లేవని ఐజీపీ శర్మ చెప్పారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన హోంమంత్రి నరోత్తం మిశ్రా కల్తీ మద్యం తయారీ దారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
జనగామలో పోలీసుల ఓవరాక్షన్.. బీజేపీ నేతలపై లాఠీచార్జ్
Death toll rises to 12, treatment of 6 people is underway after consuming liquor in Morena #MadhyaPradesh
— ANI (@ANI) January 12, 2021