ప్రజావాణికి 132 అర్జీలు

ప్రజావాణికి 132 అర్జీలు

హైదరాబాద్, వెలుగు: లక్డీకపూల్ లోని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ లో సోమవారం జరిగిన ప్రజావాణికి 132 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. గృహ నిర్మాణ శాఖకు 117, ఇతర శాఖలకు 15 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రజావాణికి వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి తొందరగా సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవోలు, తహసీల్దార్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.  వికారాబాద్ లో.. వికారాబాద్: వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణికి 173 అర్జీలు  వచ్చినట్లు కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.