రంగారెడ్డి జిల్లాలో 1,347 పోలింగ్ బూత్లు

రంగారెడ్డి జిల్లాలో 1,347 పోలింగ్ బూత్లు

రంగారెడ్డి కలెక్టరేట్​, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి  జిల్లా పోలింగ్​ కేంద్రాలు, ఓటర్ల ముసాయిదా జాబితాను శనివారం అధికారులు విడుదల చేశారు. జిల్లాలో 230 ఎంపీటీసీ, 21 జడ్పీటీసీ, 21 ఎంపీపీ స్థానాలున్నాయి. 

మొత్తంగా 1,347  పోలింగ్​ కేంద్రాలు, ఓటర్లు 7,52,259 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. ముసాయిదాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 8 వరకు తెలుపవచ్చని కలెక్టర్​ నారాయణరెడ్డి​ తెలిపారు. అన్ని మండల పరిషత్​ ఆఫీసుల్లో పోలింగ్, ఓటరు జాబితాను అందుబాటులో పెట్టినట్లు స్పష్టం చేశారు.