ఏపీలో కొత్త‌గా 13,756 కేసులు..104 మంది మృతి

ఏపీలో కొత్త‌గా 13,756 కేసులు..104 మంది మృతి

అమరావతి:  ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,756 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 16,71,742కి కరోనా కేసులు చేరాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 104 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా 10,738 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 1,73,622 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 14,87,382 మంది రికవరీ అయ్యారని తెలిపింది వైద్యారోగ్య‌శాఖ‌.