వేములవాడరూరల్, వెలుగు: ముక్కిన బియ్యం తిని శుక్రవారం మరో 14 గొర్రెలు చనిపోయాయి. రెండు రోజుల కింద ఓ రైస్ మిల్లో ముక్కిన బియ్యం పొలాల్లో పారబోయగా.. గురువారం 55 గొర్రెలు చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ఆదేశాల మేరకు సివిల్సప్లై, పశుసంవర్ధక శాఖ అధికారులు రైస్మిల్వద్ద వేర్వేరుగా విచారణ చేపట్టారు.
చనిపోయిన గొర్రెలకు వెటర్నరీ జిల్లా అధికారి రవీందర్రెడ్డి, వేములవాడ వెటర్నరీ డాక్టర్అభిలాష్ పోస్టుమార్టం చేశారు. అస్వస్థతకు గురైన గొర్రెలకు చికిత్స అందించారు. గొర్రెల కాపరులు వంగరాజమల్లు, కేశవేని మల్లేశం, వేల్పుల మహేష్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైస్మిల్యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
