రాయికల్ మండలంలో 14 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

రాయికల్ మండలంలో 14 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

రాయికల్, వెలుగు: ఇసుకు అక్రమ రవాణాపై మైనింగ్​అధికారులు మంగళవారం కొరడా ఝులిపించారు. జగిత్యాల మైనింగ్ ఏడీ సింగ్, రాయికల్ ​తహసీల్దార్​ నాగార్జున ఆధ్వర్యంలో సిబ్బంది రాయికల్​ మండలం ఇటిక్యాల పెద్దవాగు నుంచి ఇసుక తరలిస్తున్న 14 ట్రాక్టర్లను పట్టుకున్నారు. 

పెద్దవాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు అందిన సమాచారంతో అధికారులు తమ సిబ్బందితో దాడిచేయడంతో ట్రాలీలను వదిలి ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ ఇంజన్లతో పరారయ్యారు. 14 ట్రాక్టర్​లను పట్టుకొని  మైనింగ్​ శాఖకు అప్పగించినట్లు తహసీల్దార్​ నాగార్జున తెలిపారు. ఈ దాడుల్లో ఆర్​ఐలు పద్మయ్య, దేవదాస్​, జీపీవోలు ఉన్నారు.