
బజార్ హత్నూర్, వెలుగు: లేత జొన్న తిని16 ఆవులు చనిపోయిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. రైతులు తెలిపిన ప్రకారం.. బజార్ హత్నూర్ మండలం బుర్కపల్లికి చెందిన కొందరు రైతుల ఆవులు శుక్రవారం గ్రామ శివారులోని చేలల్లో మేతకు వెళ్లాయి.
లేత జొన్న చేనును తినడంతో 16 ఆవులు వెంటనే చనిపోగా.. మరో 45 ఆవుల పరిస్థితి విషమించింది. వెంటనే రైతులు వెంటనే వెటర్నరీ సిబ్బందికి సమాచారం అందించారు. వెళ్లి ఆవులకు చికిత్స చేయడంతో ప్రమాదం తప్పింది.
జొన్న పంట కోసిన వెంటనే కాల్చి వేయకుండా వదిలేయడంతో వర్షాలు పడి చిగురించిన లేత జొన్న చేనును తినడంతోనే ఆవులు చనిపోయినట్టు.. వాటి విలువ సుమారు. 4 లక్షలకుపైగా వెటర్నరీ డాక్టర్ పర్వేజ్ హైమద్ తెలిపారు.