యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 16 మంది మృతి 

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 16 మంది మృతి 

కాన్పూర్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సచెండి ఏరియాలోని కాన్పూర్, అలహాబాద్ హైవేపై టెంపోను బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా, ఆరుగురు గాయాలపాలయ్యారు. గాయాలైన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. స్థానికులతో వెళ్తున్న టెంపోను.. వేగంగా వస్తున్న ఓ బస్సు ఢీకొట్టిందని కాన్పూర్ ఎస్పీ అష్ట్‌భుజ ప్రసాద్ సింగ్ తెలిపారు. బస్సు ఢీకొట్టిన వేగానికి టెంపో హైవేలోని అవతలి రోడ్డు వైపు దూసుకెళ్లిందన్నారు. బస్సులో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. ఈ బస్సు లక్నో నుంచి ఢిల్లీకి వెళ్తోందని చెప్పారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారణకు ఆదేశించారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌‌గ్రేషియా ప్రకటించారు.