గ్రేటర్ ఎన్నికల్లో 16 మంది స్టూడెంట్స్​ పోటీ

గ్రేటర్ ఎన్నికల్లో 16 మంది స్టూడెంట్స్​ పోటీ

హైదరాబాద్,వెలుగు : ఈసారి గ్రేటర్​ఎన్నికల్లో  16 మంది స్టూడెంట్లు పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీల నుంచి కొందరు, ఇండిపెండెంట్లుగా మరికొందరు బరిలో నిలిచారు. గతంలో ఇంత మంది స్టూడెంట్స్​ ఎప్పుడు కూడా ఎన్నికల్లో కంటెస్ట్​ చేయలేదు. ఈఏడాది కరోనా, లాక్​ డౌన్​ వల్ల ఎన్నో నేర్చుకున్నామని, తాము కూడా ప్రజలకు మేలు చేసేందుకు పాలిటిక్స్​లోకి వచ్చినట్లు యంగ్​ క్యాండిడేట్స్​చెబుతున్నారు. 21, 22 ఏండ్ల  వారు  సైతం నామినేషన్​ వేశారు. స్టూడెంట్లే గాక, సాఫ్ట్ వేర్ ఎంప్లాయీస్, ప్రైవేటు టీచర్లు, డాక్టర్లు, అడ్వకేట్లు, నిరుద్యోగులు  బరిలోకి దిగారు. పోటీ చేస్తున్న మొత్తం1,122 మంది క్యాండిడేట్లలో డిగ్రీ, పీజీ చదివిన వారి సంఖ్య 40 శాతం వరకు ఉంది.  మిగతా వారంతా ఇంటర్, టెన్త్​, అంతకంటే తక్కువ చదివిన వారు ఉన్నారు. ఈసారి నలుగురు డాక్టర్లు, పది మంది అడ్వకేట్లు, నలుగురు ప్రైవేటు టీచర్లతోపాటు జర్నలిస్టులు పోటీలో ఉన్నారు.  మామూలుగా అయితే 25 ఏళ్లు దాటేంత వరకు రాజకీయాల గురించి పట్టించుకునే యూత్ ​సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. గ్రేటర్​ ఎన్నికల్లో మాత్రం 21ఏళ్ల లోపు వాళ్లు కూడా నామినేషన్ ​వేశారు. అన్ని పార్టీల క్యాండిడేట్లలో చిన్న వయసులోనే పోటీ చేస్తున్న వారు పదుల సంఖ్యలో  ఉన్నారు.

గెలిచి సేవ చేయాలనుకుంటున్న..

డిగ్రీ ఫైనలియర్​ కంప్లీట్​ చేశా. ఈసారి ఎన్నికల్లో గెలిచి ప్రజలకు సేవ చేయలనుకుంటున్నా. యూత్​ సపోర్ట్​ చేస్తే నాదే గెలుపు. డివిజన్​ డెవలప్​మెంట్​కు కృషి చేస్తా.
– ఆసిఫియా ఖాన్,  గోల్కొండ డివిజన్​ టీఆర్​ఎస్​ క్యాండిడేట్​

యూత్​ సపోర్ట్​తో గెలుస్త.. 

పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్​. చిన్నప్పటి నుంచి చూస్తున్నా గుడిమల్కాపూర్​లో పెద్దగా డెవలప్​మెంట్​ చేయలేదు.  కాంగ్రెస్ నుంచి టికెట్ అడిగినా ఇవ్వలేదు. ఇండిపెండెంట్​గా పోటీ చేస్తున్నా. యూత్​సపోర్ట్ గా ఉంటే గెలిచి డివిజన్​అభివృద్ధి చేస్తా. అబిడ్స్​లోని మెథడిస్ట్ డిగ్రీ కాలేజీలో ఫైనల్​ఇయర్​చదువుతున్నా.

– ఎం.కార్తీక్​యాదవ్ ,​గుడిమల్కాపూర్ డివిజన్ ​ఇండిపెండెంట్​క్యాండిడేట్​

ఇంట్రెస్ట్తోనే పోటీ చేస్తున్న..

ఈ ఏడాదే గ్రాడ్యుయేషన్ కంప్లీట్​ చేశా. పాలిటిక్స్​అంటే చాలా ఇంట్రెస్ట్​. చిన్న వయసులోనే కార్పొరేటర్​గా పోటీ చేస్తున్నా. గెలిపిస్తే డివిజన్​ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా..   – పి.వైష్ణవి, సనత్​నగర్​ డివిజన్​ ఇండిపెండెంట్​ క్యాండిడేట్

ప్రజాసేవ కోసం ఉండిపోయా..

బీటెక్​ కంప్లీట్​చేశా. హయ్యర్​ స్టడీస్​ కోసం అమెరికా​వెళ్దామనుకున్నా. కానీ కరోనా, లాక్​ డౌన్​ లతో కుదరలేదు.  ప్రజాసేవ చేసేందుకు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నా.- టీవీ తపస్విని, గౌతం నగర్ డివిజన్​ కాంగ్రెస్​ క్యాండిడేట్​