
- ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలో ఘటన
కాగజ్నగర్, వెలుగు : స్నానం కోసం వాగు వద్దకు వెళ్లిన ఓ స్టూడెంట్ ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోయాడు. ఈ ఘటన ఆసిఫాబాద్జిల్లా కాగజ్నగర్ మండలం భట్టుపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పిప్రి హేమంత్ (16) ఇటీవల టెన్త్ పూర్తి చేశాడు. శనివారం తన ఫ్రెండ్స్తో కలిసి స్థానికంగా క్రికెట్ ఆడాడు. తర్వాత స్నానం చేసేందుకు జగన్నాథ్పూర్ ప్రాజెక్ట్ సమీపంలోని పెద్దవాగు వద్దకు వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు.
సాయంత్రం వరకూ హేమంత్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా దొరకలేదు. చివరకు స్నేహితులను అడుగగా స్నానం చేసేందుకు పెద్దవాగు వద్దకు వెళ్లాడని చెప్పారు. ఆదివారం వాగులో గాలించగా హేమంత్ డెడ్బాడీ దొరికింది. మృతుడి తండ్రి చరణ్దాస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.