కృష్ణానదిలో .. 18 కేజీల చేప లభ్యం

కృష్ణానదిలో .. 18 కేజీల చేప లభ్యం

అలంపూర్, వెలుగు: కృష్ణానదిలో 18 కేజీల చేప దొరికింది. ఉండవల్లి మండలం మారమునగాల గ్రామానికి చెందిన జాలరి గోక రామయ్య సోమవారం కృష్ణానదిలో చేపల వేటకు వెళ్ళాడు. వలలో 18 కేజీల చేప పడగా, దానిని అమ్మితే రూ.5 వేలు వచ్చినట్లు రామయ్య తెలిపాడు. 

ఇంత పెద్ద చేప దొరకడం ఇదే మొదటిసారని సంతోషం వ్యక్తం చేశాడు.