
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ పట్టణంలోని సాయ్ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా స్థాయి బాలుర ఫుట్బాల్ ఎంపికలు అట్టహాసంగా జరిగాయి. ఈ పోటీలకు జిల్లా నుంచి 95 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన 18 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వీరందరూ ఈ నెల 27 నుంచి జులై 1వరకు నిజామాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని ఉమ్మడి మెదక్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి నగేశ్, సత్యనారాయణ, మెదక్ ఫుట్బాల్ అకాడమీ కార్యదర్శి వినయ్ పాల్గొన్నారు.