మెదక్ పట్టణంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఫుట్బాల్ ప్లేయర్ల ఎంపిక

మెదక్ పట్టణంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఫుట్బాల్ ప్లేయర్ల ఎంపిక

మెదక్​ టౌన్, వెలుగు: మెదక్​ పట్టణంలోని సాయ్​ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా స్థాయి బాలుర ఫుట్​బాల్​ ఎంపికలు అట్టహాసంగా జరిగాయి. ఈ పోటీలకు జిల్లా నుంచి 95 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన 18 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వీరందరూ ఈ నెల 27 నుంచి జులై 1వరకు నిజామాబాద్​లో  జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని ఉమ్మడి మెదక్ జిల్లా ఫుట్​బాల్​ అసోసియేషన్ కార్యదర్శి నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి నగేశ్,  సత్యనారాయణ, మెదక్ ఫుట్​బాల్​ అకాడమీ కార్యదర్శి వినయ్ పాల్గొన్నారు.