జీహెచ్ఎంసీ ప్రజావాణికి 187 ఫిర్యాదులు

జీహెచ్ఎంసీ ప్రజావాణికి 187 ఫిర్యాదులు

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ ఆఫీసుల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 187 ఫిర్యాదులు అందాయి. హెడ్డాఫీసులో నిర్వహించిన కార్యక్రమానికి 67 ఫిర్యాదులు రాగా,  చార్మినార్ జోన్​లో 6, సికింద్రాబాద్ జోన్ లో 17, కూకట్ పల్లి జోన్ లో 58, ఖైరతాబాద్ జోన్​లో 4, ఎల్బీనగర్ జోన్ లో 17, శేరిలింగంపల్లి జోన్ లో 18 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా కమిషనర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ... ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయన్నారు. హెడ్డాఫీసులో నిర్వహించిన ప్రజావాణిలో కమిషనర్​తోపాటు ఈఎన్ సీ జియాఉద్దీన్, సీఈ  దేవానంద్, చీఫ్ సిటీ ప్లానర్ రాజేంద్రప్రసాద్ నాయక్, అడిషనల్ కమిషనర్లు నళిని పద్మావతి, చంద్రకాంతరెడ్డి, గీతామాధురి, ఈఎం హెచ్ వో డాక్టర్ పద్మజ తదితరులు పాల్గొన్నారు.