- 5,48,318కి చేరిన కేసుల సంఖ్య
న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజకి విజృంభిస్తోంది. 24 గంటల్లో 19,459 కేసులు నమోదైనట్లు కేంద్ర హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. దీంతో కేసుల సంఖ్య 5,48,318 చేరింది. వ్యాధి బారినపడి 380 మంది చనిపోయారు. మరణాల సంఖ్య16,475కి పెరిగింది. ఇప్పటి వరకు 3,21,722 మంది వ్యాధి నుంచి కోలుకోగా.. మరో 2,10,120 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీలో వైరస్ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది.1,64,626 కేసులతో మహారాష్ట్ర మొదటి ప్లేస్లో ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు7429 మంది చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 83,077కి చేరింది. 2623 మంది చనిపోయారు.