INS విక్రాంత్ షిప్ లో ఉరేసుకున్న నేవీ ఉద్యోగి.. హిస్టరీలో ఫస్ట్ టైం..

INS విక్రాంత్ షిప్ లో ఉరేసుకున్న నేవీ ఉద్యోగి.. హిస్టరీలో ఫస్ట్ టైం..

ఐఎన్​ఎస్​ విక్రాంత్​షిప్ లో ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన జులై 27న కొచ్చి నావికాదళంలో జరిగింది. 

పోలీసులు తెలిపిన వివరాల వివరాల ప్రకారం.. బిహార్​రాష్ట్రం ముజఫర్​పూర్​కి చెందిన ఓ అవివాహితుడు(19) గురువారం తెల్లవారుజామున ఐఎన్​ఎస్​ విక్రాంత్​లో ఉరి వేసుకున్నట్లు రక్షణ శాఖ అధికారులు గుర్తించారు. 

ఈ ఘటనపై బోర్డ్​ ఆఫ్​ ఎంక్వైరీకి ఆదేశిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. 

ఇలాంటి ఘటన జరగడం ఇదే ఫస్ట్​ టైం అని పోలీసు అధికారులు చెబుతున్నారు. మృతుడి బంధువులకు సమాచారం అందించినట్లు వివరించారు.