ఐఎన్ఎస్ విక్రాంత్షిప్ లో ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన జులై 27న కొచ్చి నావికాదళంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల వివరాల ప్రకారం.. బిహార్రాష్ట్రం ముజఫర్పూర్కి చెందిన ఓ అవివాహితుడు(19) గురువారం తెల్లవారుజామున ఐఎన్ఎస్ విక్రాంత్లో ఉరి వేసుకున్నట్లు రక్షణ శాఖ అధికారులు గుర్తించారు.
ఈ ఘటనపై బోర్డ్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి వివరాలు ఇంకా తెలియరాలేదు.
ఇలాంటి ఘటన జరగడం ఇదే ఫస్ట్ టైం అని పోలీసు అధికారులు చెబుతున్నారు. మృతుడి బంధువులకు సమాచారం అందించినట్లు వివరించారు.