ఉద్యమకారులను గుర్తించడానికి కమిటీ ఏర్పాటు చేయండి : ఉద్యమకారుల సమితి నేతలు

ఉద్యమకారులను గుర్తించడానికి కమిటీ ఏర్పాటు చేయండి : ఉద్యమకారుల సమితి నేతలు
  •     పీసీసీ చీఫ్​ను కోరిన1969 ఉద్యమకారులు 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన 1969  ఉద్యమకారులను గుర్తించడానికి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయాలని ఉద్యమకారుల సమితి నేతలు కోరారు. ఆదివారం పీసీసీ చీఫ్​ను ఆయన నివాసంలో సమితి సెక్రటరీ జనరల్ సుదర్శన్ రావు ఆధ్వర్యంలో ఉద్యమకారులు కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం సుదర్శన్ రావు మాట్లాడారు. మున్సిపల్ కోడ్ రాకముందే కమిటీని ప్రకటించాలని తెలిపారు. ఇటీవల శాసనమండలిలో ఉద్యమకారుల అంశాన్ని ప్రస్తావించినందుకు పీసీసీ చీఫ్​ను ఉద్యమకారులు అభినందించారు. 

ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా నెలకు రూ.25 వేల పెన్షన్, 250 గజాల ఇంటి స్థలం, ఫ్రీ ట్రాన్స్​పోర్ట్, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు.1969 ఉద్యమకారులు 2,500 మంది ఉండగా అనారోగ్యాలతో మరణిస్తున్నారని చెప్పారు. దావోస్ నుంచి సీఎం రాగానే ఉద్యమకారులను ఆయన దగ్గరకు తీసుకెళ్తానని పీసీసీ చీఫ్ హామీ ఇచ్చారని సుదర్శన్ రావు వెల్లడించారు.