
సరిగ్గా నలభై ఏళ్ల క్రితం.. ఇదే రోజు 1983న కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా చరిత్ర సృష్టించింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా అండర్ డాగ్స్గా బరిలో దిగిన టీమిండియా, వన్డే వరల్డ్ కప్ గెలిచి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. చేసింది 183 పరుగులే అయినా.. క్లయివ్ లాయిడ్ కెప్టెన్సీలోని బలమైన వెస్టిండీస్ను 140 పరుగులకే మట్టి కరిపించిన తీరు అద్భుతం. అలాంటి మరుపురాని విజయాన్ని అందించిన భారత జట్టులోని ఆటగాళ్లకు ఎంత మొత్తం చెల్లించారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
1983నాటి భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ల జీతంకి సంబంధించిన ఒప్పందం కాగితం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇందులో భారత జట్టు సారథి కపిల్ దేవ్, మొహిందర్ అమర్నాథ్, సునీల్ గవాస్కర్, సందీప్ పాటిల్, రవిశాస్త్రి, మేనేజర్ బిషన్ సింగ్ బేడీ సహా 14 మంది ఆటగాళ్ల జీతాలు, అలవెన్సుల వివరాలు ఉన్నాయి. వారి వారి జీతాల పక్కన ప్లేయర్లు సంతకాలు కూడా చేసి ఉన్నారు.
అలవెన్స్ రూ.200, మ్యాచ్ ఫీజు రూ.1500
ప్రతి ఆటగాడికి రోజుకు రూ.200 చొప్పున మూడు రోజులకు గానూ రూ.600 అలవెన్స్ చెల్లించారు. ఇక మ్యాచ్ ఫీజుగా రూ.1500 ఇచ్చారు. అంటే.. మొత్తం రూ.2100 చెల్లించారన్నమాట. అదే జీతం కెప్టెన్ కపిల్ దేవ్, వైస్ కెప్టెన్ మొహిందర్లకు కూడా చెల్లించారు. వీరితో పాటు సునీల్ గవాస్కర్, కె. శ్రీకాంత్, యశ్పాల్ శర్మ, సందీప్ పాటిల్, కీర్తి ఆజాద్, రోజర్ బిన్నీ, మదన్ లాల్, సయ్యద్ కిర్మాణి, బల్వీందర్ సంధు, దిలీప్ వెంగ్సాకర్, రవిశాస్త్రి, సునీల్ వాల్సన్ జట్టులోని సభ్యులు.
The match fee received by the 1983 World Champions will leave you speechless.
— CricTracker (@Cricketracker) June 25, 2023
?: Ramiz Raja#RamizRaja #WorldCup2023 pic.twitter.com/8tlqqLuLSc