ఏపీలో కొత్తగా 19,981 కరోనా కేసులు..118 మంది మృతి

 ఏపీలో కొత్తగా 19,981 కరోనా కేసులు..118 మంది మృతి

అమరావతి: ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,981 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ‌. కొత్త‌ కేసులతో కలిపి రాష్ట్రంలో 15,62,060కి కరోనా కేసులు చేరాయని తెలిపిన  వైద్యారోగ్య‌శాఖ‌.. 24 గంటల్లో కరోనాతో 118 మంది మృతి చెందారని చెప్పింది. ఇప్పటివరకు వైర‌స్ తో 10,022 మంది మృతి చెందారంది. ప్రస్తుతం ఏపీలో 2,10,683 యాక్టివ్‌ కేసులున్నాయని.. ఇప్పటివరకు కరోనా నుంచి 13,41,355 మంది రికవరీ అయ్యారని తెలిపింది ఏపీ వైద్యారోగ్య‌శాఖ‌.