
లెనిన్ నగర్ జీపీ నిర్ణయం
కొమురవెల్లి, వెలుగు: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం లెనిన్ నగర్పంచాయతీ కొత్త నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛ పల్లెగా మార్చడం కోసం కిలో ప్లాస్టిక్ ఇస్తే.. కిలో బియ్యం ఇవ్వనున్నట్లు పంచాయతీ సర్పంచి సనాది సబిత ప్రకటించారు. ఉప సర్పంచ్దాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలో ప్లాస్టిక్ ఎవ్వరి ఇంట్లో ఉన్నా.. గ్రామ పంచాయతీకి అప్పగిస్తే.. తూకం వేసి అందుకు సమానమైన బియ్యం ఇస్తామని తెలిపారు. అనంతరం పంచాయతీ కార్యవర్గం గాంధీకి నివాళి అర్పించారు.