న్యూఇయర్ స్పెషల్.. నైవేద్యంగా హనుమంతుడికి 20వేల కిలోల లడ్డూలు

న్యూఇయర్ స్పెషల్.. నైవేద్యంగా హనుమంతుడికి 20వేల కిలోల లడ్డూలు

పాట్నాలోని మహావీర్ మందిర్ లో కొత్త సంవత్సరం సందర్భంగా హనుమంతుడికి నైవేద్యం సమర్పించేందుకు 20వేల కిలోల నైవేద్యం లడ్డూలను సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ అయోధ్యకు చెందిన ఆరుగురు పూజారులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అయితే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సందర్శకుల భద్రత కోసం అధికారులు 220 మంది భద్రతా సిబ్బందిని నియమించారు.

తిరుపతికి చెందిన నైపుణ్యం కలిగిన కళాకారులు డిసెంబర్ 31 నుంచి నైవేద్యం సిద్ధం చేయడం ప్రారంభిస్తారు. జనవరి 1, 2 తేదీల్లో భక్తుల రద్దీని అంచనా వేయడంతోపాటు రద్దీ నిర్వహణ, పోలీసు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల మోహరింపుతో సహా అవసరమైన సన్నాహాలు ఇప్పటికే పూర్తయినట్టు సమాచారం.. ఈ ఆలయం సాధారణంగా ఉదయం 5 గంటలకు తెరుచుకుంటుంది. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ అధికారులు.. స్త్రీ, పురుషులకు వేర్వేరు క్యూలైన్లను ఏర్పాటు చేశారు.