జాబ్ మేళాకు విశేష స్పందన

 జాబ్ మేళాకు విశేష స్పందన

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణం లోని కార్మెల్​ డిగ్రీ కాలేజీలో మంగళవారం నిర్వహించిన జాబ్​మేళాకు నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆదిలాబాద్​క్యాథలిక్​ మెత్రాసనం, డాన్ బాస్కో క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో జాబ్​మేళా నిర్వహించారు.

22 కంపెనీల నుంచి ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు నిర్వహించిన మేళాకు 400 మంది అభ్యర్థులు హాజరు కాగా, 210 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు కార్మెల్​ కాలేజీ డైరెక్టర్​ డాక్టర్ ఫాదర్​ జేవియర్ ​రెక్స్, యూత్​ వింగ్​డైరెక్టర్ ఫాదర్​ జిజో, ఫాదర్ షాపియన్, డాన్​బాస్కో నిర్వాహకులు ఫాదర్​ జస్టిన్​ నియామక పత్రాలు అందజేశారు.