తెలంగాణలో కొత్తగా 2,175 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కొత్తగా 2,175 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో గత 24 గంటల్లో 1,36,096 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 2,175  పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.GHMC పరిధిలో కొత్తగా 253 కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం సాయంత్రం బులిటెన్‌ విడుదల చేసింది. కరోనాతో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 3,346కి చేరింది. కరోనా బారి నుంచి.. నిన్న(గురువారం) 3,821 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30,918 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. రికవరీ రేటు 94 శాతం.