ఉత్తర భారతంలో కురుస్తున్న భారీ వర్షాలు సామాన్య ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరపి లేని వర్షాలకు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఇక జమ్ముకశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర్ప్రదేశ్లలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షపాతం నమోదైతవుతోంది. దీంతో పెద్ద ఎత్తున వరదలు సంభవించడంతో పాటు కొండ చరియలు కూడా విరిగిపడుతున్నాయి. తాజాగా కొండ చరియలు విరిగిపడి 22 మంది చనిపోగా.. 6 గురు గల్లంతయ్యారు.
ఇక మరికొన్ని ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులు తెగిపోయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వరదల కారణంగా కాలువలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. ఇక నిన్నటికి నిన్న కాంగ్రా లోయలో చక్కీ నదిపై ఉన్న ఓ రైల్వే బ్రిడ్జ్.. వరదల కారణంగా కొట్టుకుపోయింది. పఠాన్కోట్- మండి జాతీయ రాహదారిలో కొండచరియలు విరిగిపడటంతో.. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
#WATCH | Normal life severely affected as water from overflowing Ganga-Yamuna rivers enters residential areas in Prayagraj, Uttar Pradesh pic.twitter.com/0H0QlbifEW
— ANI (@ANI) August 21, 2022
ఉతరాఖండ్ లోనూ వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. కాగా ఓ బాలుడు ఈ వరద నీటిలో చిక్కుపోగా... అతన్ని ఎస్డీఆర్ఎఫ్ దళాలు వెంటనే అక్కడికి చేరుకొని ఆ బాలున్ని రక్షించారు.
Uttarakhand | SDRF Rescue reached the spot on receiving info of some people being trapped in Aranyam Resort in Mohanchatti area of Pauri Garhwal district. All connectivity had been broken. Teams were mobilized immediately, rescue work is in progress: SDRF https://t.co/9PlOycKXbK pic.twitter.com/0Jiaaxl1mP
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 21, 2022