కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో పతకం

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో పతకం

బర్మింగ్‌హామ్‌ : కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ జోరు కొనసాగుతోంది. వెయిట్‌లిఫ్టర్లు అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్నారు. వెయిట్‌ లిఫ్టింగ్‌ 55కిలోల విభాగంలో 23 ఏళ్ల బింద్యారాణి రజతం గెలుచుకుంది. స్నాచ్‌లో 86, క్లీన్ అండ్ జెర్క్‌లో 116.. మొత్తం 202 కేజీల స్కోర్ చేసిన బింద్యారాణి.. భారత్‌కు నాలుగో పతకాన్ని సాధించి పెట్టింది. ఇప్పటికే మహిళల 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను స్వర్ణం, పురుషుల 55 కేజీల్లో సంకేత్‌ రజతం, 61 కేజీల విభాగంలో గురురాజ పూజారి కాంస్యం నెగ్గారు. దీంతో పతకాల పట్టికలో భారత్‌ టాప్-10లో నిలిచింది.

రజత పతకం సాధించిన వెయిట్‌ లిఫ్టర్‌ బింద్యారాణి దేవీకి ప్రధాని నరేంద్ర మోడీ ట్విటర్‌లో అభినందనలు తెలిపారు. ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు కూడా  బింద్యారాణికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.