తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2398 కరోనా కేసులు నమోదవ్వగా ముగ్గురు చనిపోయారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 7,05,199 కుచేరాయి. మరణాల సంఖ్య 4,052 కు చేరింది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 11,891 మంది కోలుకున్నారు. ఇంకా 21,676 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1233 కేసులునమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 192, మేడ్చల్ లో 191 కేసులు నమోదయ్యాయి.