
గాంధీనగర్: అహ్మదాబాద్ విమానం కూలిపోయిన ప్రమాదంలో మృతులపై క్లారిటీ వచ్చింది. విమానంలోని మొత్తం 242 మంది చనిపోయారని.. ఒక్కరు అంటే ఒక్కరు కూడా బతకలేదని.. అందరూ చనిపోయినట్లు అహ్మదాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ జ్ణానేంద్ర సింగ్ ప్రకటించినట్లు జాతీయ మీడియా ప్రకటించింది. విమానంలో 230 మంది ప్రయాణికులు.. ఇద్దరు పైలెట్లు.. 10 మంది విమానం సిబ్బంది ఉన్నారు.
వీళ్లందరూ కూడా చనిపోయినట్లు కన్ఫామ్ చేశారు అహ్మదాబాద్ సీపీ. 100 మృతదేహాలను అహ్మదాబాద్ సిటీ ఆస్పత్రిలో ఉన్నాయని.. మిగతా వారు సిటీలోని పలు ఆస్పత్రుల్లో ఉన్నట్లు స్పష్టం చేశారాయన. చనిపోయిన వారిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ వాసులు, ఒక కెనడియన్, ఏడుగురు పోర్చుగల్ వారు ఉన్నట్లు నిర్థారించారాయన. మృతుల్లో ఇద్దరు పసిపాపలు, మరో 10 మంది చిన్నారులు ఉన్నట్లు విమానయాన శాఖ వెల్లడించింది.
DNA పరీక్షలు చేయాల్సిందే:
విమాన ప్రమాదంలో చనిపోయిన 242 మందిని గుర్తించటం అనేది ఇప్పుడు పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే.. చాలా మంది గుర్తించటానికి వీలులేకుండా మాంసం ముద్దలుగా మారిపోయారు. శరీరభాగాలు తెగిపడిపోయాయి. సగం కాలిపోయిన మృతదేహాలను ఆస్పత్రులకు తరలించారు. 50 నుంచి 70 శాతం వరకు కాలిపోయిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.
Also Read : విమానం క్రాష్.. మరణించిన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా సంస్థ ఏం చెల్లిస్తుంది..?
వీళ్లను గుర్తించటానికి చాలా సమయం పట్టనుంది. విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యుల శాంపిల్స్ తీసుకోవాలి.. వాళ్ల డీఎన్ ఏతో.. చనిపోయిన వారి డీఎన్ ఏ మ్యాచ్ కావాలి.. ఈ ప్రసీజర్ అంతా జరగటానికి కొన్ని రోజుల సమయం పట్టొచ్చు అంటున్నారు డాక్టర్లు. ఇందులో విదేశీయులు కూడా ఉండటంతో.. వారి వారి కుటుంబ సభ్యులు ఇండియాకు రావాలి.. వాళ్ల శాంపిల్స్ సేకరించిన తర్వాత.. పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. చనిపోయిన వారిని వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించటం అనేది ఇప్పుడు అంశంగా మారింది.
విమాన ప్రమాద మృతుల్లో గుజరాత్ రాష్ట్ర మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నారు. ఆయన లండన్ వెళ్లిరావటానికి రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకున్నారు. ఊహించని విధంగా విమాన ప్రమాదంలో చనిపోయారాయన. చనిపోయిన అందరికీ పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని వెల్లడించారు. చాలా మంది గుర్తించటానికి వీల్లేకుండా కాలిపోయారని.. కొన్ని శరీరభాగాలు తెగిపోయాయని.. మరికొందరు మాంసం ముద్దలుగా ఉన్నారని.. వాళ్లను గుర్తించటానికి DNA పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు డాక్టర్లు.