మంగపేట, వెలుగు: జాతరలో భక్తులు మొక్కులు తీర్చుకునేటప్పుడు, ప్రమాదాలకు గురైనప్పుడు 24 గంటలు అత్యవసర సేవలు అందించామని వరంగల్ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ శివకుమార్ తెలిపారు. 24 అంబులెన్స్ లు 24 గంటలు సేవలు అందించాయని చెప్పారు. 40 బైక్ అంబులెన్స్లను డే అండ్ నైట్ రెడీ ఉంచామని పేర్కొన్నారు. రెండు జిల్లాల మేనేజర్లతో పాటు అదనంగా 15 మంది సిబ్బంది సేవలు అందించారన్నారు. 6 వేల 65 మందికి సేవలు అందించడంతో పాటు రెండు డెలివరీ చేసినట్టు వెల్లడించారు.
సైరన్ వేసుకుని ప్రయాణికుల ట్రాన్స్ పోర్ట్
ఏటూరునాగారం: జాతరలో ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటుచేసిన అంబులెన్స్ భక్తులను గద్దెల వద్దకు చేర్చి సేవలను దుర్వినియోగం చేసింది. వైద్య ఆరోగ్య శాఖ అంబులెన్స్(టీఎస్25టీ6591) సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా జనాలను తరలించి సొమ్ము చేసుకోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
